News April 14, 2025

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోనే టాప్ గోదూరు

image

జగిత్యాల జిల్లాలో ఎండ దంచికొడుతోంది. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూరు రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలిచింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 19, 2025

దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

image

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.

News October 19, 2025

విశాఖ-బెంగళూరు మధ్య స్పెషల్ రైలు

image

దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. అక్టోబర్ 21న ఉదయం 8.20కు విశాఖపట్నం నుంచి బెంగళూరు ఎస్‌ఎమ్‌వీటీకి వన్‌వే స్పెషల్ రైలు (సంఖ్య 08545) బయలుదేరి, అక్టోబర్ 22న ఉదయం 6.45కు చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి,యలమంచిలి, సామర్లకోట రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

News October 19, 2025

వీధి వ్యాపారులతో ముచ్చటించిన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0తో ధరల తగ్గింపు గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు యజమానులు, సామాన్య ప్రజలతో ముచ్చటించారు.