News October 20, 2025

ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారి వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన ఇబ్రహీంపట్నం మం. యామాపూర్‌‌కు చెందిన ఏలేటి జనార్దన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ప్రకారం.. జనార్దన్‌ నాలుగేళ్ల క్రితం మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీ వేధింపులతో వ్యాపారి ఆయన భూమిని సెల్‌ డీడ్‌ చేయించుకున్నాడు. అప్పు చెల్లించినా వేధింపులు కొనసాగుతుండడంతో జనార్దన్‌ ఆత్మహత్యకు యత్నించారు.

Similar News

News October 20, 2025

వనపర్తి DCC అధ్యక్ష పదవికి 23 దరఖాస్తులు

image

వనపర్తి DCC అధ్యక్ష పదవికి మొత్తం 23 మంది దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 19 మంది, దేవరకద్ర, మక్తల్ నుంచి ఇద్దరేసి చొప్పున దరఖాస్తు చేశారు. WNP నుంచి లక్కాకుల సతీష్, సాయి చరణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, తిరుపతయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతోందని నేతలు చెబుతున్నారు.

News October 20, 2025

నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం: కెనడా ప్రధాని

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తమ దేశంలో అమలు చేస్తామని కెనడా పీఎం మార్క్ కార్నీ ప్రకటించారు. నెతన్యాహు తమ దేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధ నేరాలకు గాను 2024 నవంబర్ 21న నెతన్యాహుపై ICC అరెస్ట్ <<14671651>>వారెంట్ జారీ <<>>చేసిన విషయం తెలిసిందే.

News October 20, 2025

పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వీరేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.