News August 27, 2025

ఇరాక్‌లో జగిత్యాల జిల్లా వాసుల వేడుకలు

image

ఇరాక్ దేశంలోని రాయల్ దులీప్ హోటల్‌లో ఉంటున్న దాదాపు 150 మంది జగిత్యాల జిల్లా వాసులు వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మండపాన్ని అలంకరించి గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. గణనాథుడికి తొమ్మిది రోజులపాటు నిత్యపూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల రాజు, రంజిత్, నితిన్, శ్రీకాంత్, రోహిత్, హరీష్, సాయి, సందీప్ పాల్గొన్నారు.

Similar News

News August 27, 2025

KMR: వరద బీభత్సం.. 60 మందిని కాపాడిన పోలీసులు

image

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సుమారు 60 మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన కామారెడ్డి పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షితంగా రెస్క్యూ చేసి, సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.

News August 27, 2025

ఆదిలాబాద్: భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

image

రానున్న 3, 4 రోజుల పాటు ఆదిలాబాద్‌లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004251939 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తతో ఉన్నారని పేర్కొన్నారు.

News August 27, 2025

కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ వేసేందుకు క్యాబినెట్ ఆమోదం

image

2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్‌, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.