News November 11, 2025

ఇరిగేషన్ శాఖకు రూ.52.5 కోట్ల నష్టం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికంగా పడింది. ప్రధానంగా మున్నేరు ఉదృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో కాలువలు కోతకు గురయ్యాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. మైనర్ ఇరిగేషన్ డామేజ్ 91 ప్రాంతాల్లో జరగగా రూ.32.5cr నష్టం వాటిల్లింది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.12.5cr, మేజర్ ఇరిగేషన్ రూ.7.5cr, కల్వర్టులకు రూ. 3.64cr వరకు ఖర్చవుతాయని అధికారులు తేల్చారు.

Similar News

News November 11, 2025

HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

image

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.

News November 11, 2025

తాండూర్ కంది సాగు రికార్డు

image

వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది కంది సాగు గత ఏడాది కంటే వేల ఎకరాలు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. గత ఏడాది 1.04L ఎకరాల్లో కంది పంట వేయగా, ఈ ఏడాది 1.05L ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. తాండూర్ కందిపప్పుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించి జీఐ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ కంది పప్పు పోషకాలతో పాటు రుచికరంగా ఉండటం విశేషం.

News November 11, 2025

ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్

image

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సేవలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆజాద్ జయంతి, మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.