News February 12, 2026
ఇలాంటి నాయకుడు కావాలి సర్!

ఆప్ ఎంపీ, యువ నేత <<19108486>>రాఘవ్ సింగ్ చద్ధా<<>> పార్లమెంటులో లేవనెత్తుతున్న సమస్యలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆహార కల్తీ, ధరలు, ప్రజా సంక్షేమం, పన్నుల మోత.. ఇలా సామాన్యుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన వల్లే 10 నిమిషాల డెలివరీ, గిగ్ వర్కర్ల సమస్యలు దేశానికి తెలిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ కంటే వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉందని వేతన జీవుల కష్టాన్ని తెలియజేశారు.
Similar News
News February 15, 2026
భారత్ 15 ఓవర్లు కూడా ఆడలేదు.. ఇమాద్ ఓవరాక్షన్!

భారత్-పాక్ మ్యాచ్కు ముందు దాయాది మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. శ్రీలంక పరిస్థితుల్లో టీమ్ఇండియా 15 ఓవర్లు కూడా నిలబడలేదని, అక్కడ భారత్లో లాగా చిన్న బౌండరీలు ఉండవంటూ తన నోటి దురుసును బయట పెట్టుకున్నారు. పాక్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు తేలిపోతారని, దూకుడుగా ఆడాలని చూస్తే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో గట్టిగానే కౌంటరిస్తున్నారు.
News February 15, 2026
కేదార్నాథ్ పుణ్యక్షేత్రం రీఓపెన్ ఎప్పుడంటే?

12 జ్యోతిర్లింగాలలో ఒకటి, చార్ధామ్ యాత్రలో భాగమైన ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ రీఓపెన్ తేదీని ఆ రాష్ట్ర CM పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఏప్రిల్ 22 నుంచి శివుడిని దర్శించుకోవచ్చని చెప్పారు. అందుకు తగ్గట్లు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విపరీతమైన మంచు వల్ల ఆలయాన్ని గతేడాది అక్టోబర్ 23న మూసేశారు. కేదార్నాథ్ టెంపుల్ సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
News February 15, 2026
సమ్మర్ ఎంటర్.. ఏసీలు సర్వీసింగ్ చేయిస్తున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం దాదాపు ముగిసిపోయి సమ్మర్ ఎంటరైంది. దీంతో ఏసీల వాడకానికి టైమ్ వచ్చేసింది. అయితే ముందుగా వాటిని సర్వీసింగ్ చేయించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కూలింగ్ సరిగా ఇవ్వకపోగా పవర్ బిల్ షాక్ ఇస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయడం, గ్యాస్ లీక్లను టెక్నీషియన్లతో చెక్ చేయించాలని సూచిస్తున్నారు. ఏటా రెండు సార్లైనా సర్వీసింగ్ చేయించాలంటున్నారు.


