News March 27, 2024

ఇల్లంతకుంటలో గుండెపోటుతో విద్యార్థి మృతి !

image

సిరిసిల్ల: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగింది. గ్రామానికి చెందిన ఎల్లంకి సాయితేజ(14) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధితో సాయి బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Similar News

News September 7, 2025

కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

image

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.

News September 7, 2025

కరీంనగర్: ఓపెన్ స్కూల్లో చేర్చాలి

image

స్వయం సహాయక సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మెప్మా, డీఆర్‌డీఓ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ వెంటనే ఓపెన్ స్కూల్లో చేర్పించి, విద్యను ప్రోత్సహించాలని సూచించారు.

News September 6, 2025

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తపల్లిలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.