News April 17, 2025
ఇల్లందకుంట జాతర బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిసాయని ఈఓ సుధాకర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుండి 16 ఏప్రిల్ వరకు వైభోపేతంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల హుండీలను దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 22 ఏప్రిల్ 2025న ఉదయం 9గంటలకు లెక్కించనున్నట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్లో రావాలని సూచించారు.
Similar News
News September 10, 2025
KNR: ‘దివ్యాంగులు జాబ్ పోర్టల్లో నమోదు చేసుకోండి’

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మనోహర స్వామి తెలిపారు. టెన్త్ సర్టిఫికేట్ ఆధారంగా www.pwdjob.portal.telangana.gov.in వెబ్సైట్లో ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని కోరారు. ఈ పోర్టల్ ద్వారా 300కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
News September 10, 2025
KNR: TGCPGET ఫలితాల్లో SRR జంతు శాస్త్ర విద్యార్థుల రాష్ట్రస్థాయి ర్యాంకులు

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగంలో విద్యార్థి ఏ.శివప్రసాద్ రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారు. దీనితో పాటుగా ఎన్.ఆదిత్య 40వ ర్యాంకు, సీహెచ్. శివాజీ 70వ ర్యాంకు, జె.సంహిత 100 ర్యాంకు, కే.సాయితేజ 107, అనేక మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె.కిరణ్మయి విద్యార్థులను సన్మానించారు.
News September 10, 2025
KNR: RTC పంచారామాలు టూర్ ప్యాకేజీ వివరాలు

KNR- 2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో పంచారామాలు అనగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోట దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఈనెల 12న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 15న బస్సు KNR చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.3,300/-, పిల్లలకు రూ.2,500/- టికెట్ నిర్ణయించామన్నారు. వివరాలకు CALL 9398658062.