News March 31, 2025

ఇల్లందకుంట: 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

image

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కళ్యాణం, పట్టాభిషేకం, చిన్న రథం, పెద్ద రథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హనుమకొండ, భూపాలపల్లి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.

Similar News

News February 22, 2026

మార్నింగ్ క్యారెట్ జ్యూస్ తాగితే..

image

ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ‘అధిక వాటర్ పర్సంటేజ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తాయి. విటమిన్-B6 శక్తినిస్తుంది. విటమిన్-A స్కిన్ గ్లో పెంచుతుంది. విటమిన్-C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తక్కువగా ఉండే క్యాలరీలు బరువు పెరగకుండా చేస్తాయి’ అని వివరించారు.

News February 22, 2026

NRML: గల్ఫ్ కార్మికులకు ఆసరా.. హెల్ప్‌లైన్ నంబర్ విడుదల

image

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లా కార్మికుల కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు 9398421883 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు. బాధితులకు తక్షణ సహాయం అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

News February 22, 2026

ప.గో: జడ్పీ ఛైర్మన్ జీతానికీ దిక్కు లేదు!

image

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గుర్తు వచ్చేది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. గత ప్రభుత్వంలో జీతాలు అందక ఇబ్బందులు పడ్డ వీళ్లు.. ఈ ప్రభుత్వంలోనైనా వేతనాలు చెల్లిస్తారని భావించినా నిరాశే మిగిలింది. ఉమ్మడి ప.గో జిల్లాలో 48మంది ZPTCలకు నెలకు రూ.6 వేలు చొప్పున, 875 మంది MPTCలకు రూ.3 వేలు చెల్లించాలి. వీరితో ఎన్నుకోబడిన జడ్పీ చైర్మన్‌కి కూడా నెలకు రూ. 40 వేలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ముందుకు రావట్లేదు.