News October 15, 2025
ఇల్లందు: సింగరేణి అభివృద్ధికి మేధోమథనం

సింగరేణి సంస్థ భవిష్యత్తులో 100 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దిశగా పయనించడానికి భవిష్యత్ ప్రణాళికపై మేధోమథన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఇల్లందు హెడ్ ఆఫీస్లో సీపీపీ, హెచ్ఆర్డీ విభాగాల ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ మనోహర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో డైరెక్టర్లు, పదవీ విరమణ పొందిన డైరెక్టర్లు పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
KNR: 20 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.
News October 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 16, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 16, 2025
పాలమూరు: GREAT.. తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు!

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాపూర్ వాసి వేముల శ్రీనివాసులు(42) హైదరాబాద్లో మేస్త్రీ పని చేస్తూ ఈనెల 10వ తేదీన మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అతడి అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో కాలేయం, గుండె, కిడ్నీలు, కార్నియాస్ను ఆరుగురికి దానం చేశారు.