News May 11, 2024
ఇవాళ తెలంగాణలో ప్రియాంకా గాంధీ షెడ్యూల్ ఇదే..

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె.. ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షోలో పాల్గొంటారు. ప్రియాంకతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయా ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
Similar News
News March 14, 2025
ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.
News March 14, 2025
అమెరికన్ NRIs బీకేర్ఫుల్… లేదంటే!

అమెరికాలో NRIలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డీపోర్టేషన్ కోసం వార్టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తుండటం, గ్రీన్కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని VP JD వాన్స్ చెప్పడాన్ని వారు ఉదహరిస్తున్నారు. లీగల్గా అక్కడికి వెళ్లినా తొలి ప్రాధాన్యం వైట్స్కేనని అంటున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తుచేస్తున్నారు. COMMENT.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.