News November 30, 2025
ఇవాళ, రేపు జాగ్రత్త: అనిత

AP: దిత్వా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ఇవాళ, రేపు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. తుఫానుపై RTGS సెంటర్ నుంచి నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలన్నారు.
Similar News
News April 5, 2026
బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దంతాల ఆరోగ్యం కోసం రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ వాడాలి. గట్టిగా ఉండేవి వాడితే దంతాలపై ఎనామెల్ పొరను అరిగిపోయేలా చేస్తాయి. కనీసం 2min నోటిలోని అన్ని వైపులా తోమాలి. నాలుకను క్లీన్ చేసుకోవాలి. తిన్న తర్వాత బ్రష్ చేయాలనుకుంటే వెంటనే చేయవద్దు. 30-60min తర్వాతే చేయాలి. 3 నెలలకోసారి బ్రష్ను మార్చాలి’ అని సూచిస్తున్నారు.
News April 5, 2026
HYDలో IPL మ్యాచ్.. నేడు డబుల్ ధమాకా

IPLలో నేడు 2 మ్యాచులు జరగనున్నాయి. 3.30PMకి హైదరాబాద్ వేదికగా SRH, LSG తలపడనున్నాయి. 7.30PMకి బెంగళూరులో CSK, RCB మ్యాచ్ జరగనుంది. HYD పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుందని, భారీ స్కోర్ నమోదయ్యే అవకాశముందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు బెంగళూరు పిచ్ పేసర్లకు హెల్ప్ అవుతుందని, 200 రన్స్ చేస్తే మంచి స్కోర్ అవుతుందని అంచనా. ఈరోజు LSG, CSK బోణీ కొడతాయా లేదా SRH, RCB మరో విక్టరీ సాధిస్తాయో చూడాలి.
News April 5, 2026
భారత ఎగుమతులపైనా యుద్ధ ప్రభావం: సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటికే దిగుమతులపై ప్రభావం పడింది. వెస్ట్ ఏషియా కూడా ముఖ్యమైన మార్కెట్. ఎగుమతుల్లో 12-13% అక్కడికే వెళ్తున్నాయి. వీటిపై యుద్ధ ప్రభావం ఎంతనేది 2-3 వారాల్లో స్పష్టత వస్తుంది. అన్ని రంగాల్లో ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.


