News March 23, 2026
ఇవాళ ‘వాహన్’ పోర్టల్లోకి TG ఎంట్రీ

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్లైన్కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్ నేటి నుంచి రద్దవనుంది.
Similar News
News April 5, 2026
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.
News April 5, 2026
ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.
News April 5, 2026
రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>


