News March 1, 2026
ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు!

ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేస్తే కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. వయనాడ్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన టౌన్షిప్ ఇవాళ ప్రారంభంకానుంది. ముండక్కై-చూరల్మల కొండచరియలు కూలడంతో ఇళ్లు కోల్పోయిన 178 కుటుంబాలకు మొదటి దశలో అన్ని సౌకర్యాలతో కూడిన 51 నూతన గృహాలను సీఎం పినరయి అందజేశారు. ఒక్కో ఇంటిపై రూ.26లక్షలు ఖర్చు చేశారు.
Similar News
News March 4, 2026
అమెరికా-ఇరాన్ పోరుపై RGV ట్వీట్

మిడిల్ఈస్ట్ను ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టేసిన అమెరికా-ఇరాన్ పోరుపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జీసస్ – అల్లాకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్న RGV.. ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానన్నారు. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కావడంతో ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News March 4, 2026
రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
News March 4, 2026
ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు: ట్రంప్

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక గతంలో కంటే కూడా తగ్గుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఇరాన్పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదన్నారు. కాగా ఇరాన్పై దాడుల్లో సహకరించని స్పెయిన్తో ట్రేడ్ రద్దు చేసుకుంటామన్న ట్రంప్ యూకేపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.


