News February 22, 2025

ఇసుక ఓవర్ లోడింగ్‌కు పాలు పెడితే కఠిన చర్యలు: DSP

image

ఓవర్ లోడింగ్‌లను అరికట్టేందుకు మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ములుగు DSP రవీందర్ పరిశీలించారు. చెక్ పోస్టులో ఉన్న సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా DSP రవీందర్ మాట్లాడుతూ.. ఎవరైనా ఇసక ఓవర్ లోడింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 10, 2025

ములుగు గజ గజ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

అకాల వర్షాలతో ఆగమైన ప్రజలకు చలి రూపంలో మరో విపత్తు ఎదురవుతోంది. రేపటి నుంచి పది రోజులపాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పగలు, రాత్రి సమయాల్లో 10-14 డిగ్రీలు పడిపోతుందని పేర్కొంది. ఈరోజు నుంచే ములుగు ఏజెన్సీలో చలి ప్రభావం మొదలైంది. ఉదయం బారేడు పొద్దెక్కినా ఎక్కిన చలి ప్రభావం తగ్గలేదు. గోదావరి పరివాహక అటవీ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

News November 10, 2025

ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 11 నిర్వహించే సర్దార్ ఏ-150 ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉదయం 9:30 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. జిల్లాలోని విద్యార్థులు, యువత, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.