News February 22, 2025

ఇసుక ఓవర్ లోడింగ్‌కు పాలు పెడితే కఠిన చర్యలు: DSP

image

ఓవర్ లోడింగ్‌లను అరికట్టేందుకు మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ములుగు DSP రవీందర్ పరిశీలించారు. చెక్ పోస్టులో ఉన్న సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా DSP రవీందర్ మాట్లాడుతూ.. ఎవరైనా ఇసక ఓవర్ లోడింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 28, 2026

ప్రొద్దుటూరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకు అవినీతిపై పూర్వక మేనేజర్ ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంటి దొంగలు ఆందోళన చెందుతున్నారు. వీరిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మొదట పెట్రోల్ బంక్ అవినీతిపై కేసు నమోదయింది. మున్సిపల్, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ, శివాలయంలో అవినీతిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.

News February 28, 2026

కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

image

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

VJA: పెట్టుబడి పెట్టి NHAI నుంచి లాభాలు స్వీకరించే అవకాశం

image

కోల్‌కతా- చెన్నై హైవేలో టోల్ గేట్ల ఆపరేషన్‌కై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ హైవేలో విజయవాడ- చిలకలూరిపేట మధ్య 69.4 కి.మీ. మేర టోల్ గేట్ల నిర్వహణలో పబ్లిక్ ఇన్విట్ విధానంలో ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించి, పెట్టుబడి కంటే పైబడి వచ్చే నగదును లాభం కింద NHAI ప్రజలకు అందిస్తుంది. విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి.