News September 9, 2024

‘ఇసుక సరఫరాను నిబంధనలకు అనుగుణంగా సజావు పంపిణీ చేయాలి’

image

కడప జిల్లాలోని ఇసుక రీచులలో ఇసుక సరఫరాను ప్రభుత్వ తాజా నియమ నిబంధనలకు అనుగుణంగా సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా, కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శివ శంకర్ పాల్గొన్నారు.

Similar News

News December 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో బుధవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2,240

News December 24, 2025

పులివెందులలో ఇవాళ జగన్ పర్యటన వివరాలు

image

మాజీ సీఎం జగన్ ఇవాళ్టి పర్యటన వివరాలను వైసీపీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9:30కు పులివెందుల నుంచి బయలుదేరి 10:30కి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ 1:00 గంట వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2 గంటలకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాత్రి 7 గంటల వరకు ప్రజలను కలుస్తారు. అనంతరం నివాసానికి వెళతారు.

News December 24, 2025

మాజీ సీఎం జగన్‌ను కలిసిన జిల్లా ముఖ్య నాయకులు

image

మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. పులివెందులలోని ఆయన నివాసంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ నాయకులకు సూచించారు.