News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.
Similar News
News November 2, 2025
హైదరాబాద్ NFCలో అప్రెంటిస్ ఖాళీలు

HYDలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. నెలకు 10,500 స్ట్రైఫెండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: https://www .nfc.gov.in/recruitment.html
News November 2, 2025
మణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYD మణికొండలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. పశ్చిమ ప్లాజా సమీపంలో ఎలాంటి పత్రాలు లేని ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, కబ్జాదారులను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్ను ఏర్పాటు చేసింది.
News November 2, 2025
HYD: BHEL విజిలెన్స్ వారోత్సవంలో హైడ్రా కమిషనర్

HYD BHEL విజిలెన్స్ వారోత్సవంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనకు వ్యవస్థలు, చట్టాలు, పౌరుల హక్కులపై అందరిలోనూ అవగాహన అవసరమని అన్నారు. హైడ్రా చేపట్టిన చర్యల వల్ల ప్రజల్లో చెరువుల FTL, బఫర్, నాలాల అవశ్యకతపై అవగాహన పెరిగి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో BHEL E.D కేబీరాజా, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.


