News October 11, 2024

ఈనెల 13న కొడంగల్ రానున్న CM రేవంత్ రెడ్డి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13న కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ గురువారం తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే దసరా తర్వాత కార్యకర్తలను కలవడం ఆనవాయితీగా వస్తుంది. ఈనెల 12న వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మరుసటి రోజు కొడంగల్ రానున్నారు.

Similar News

News October 11, 2024

MBNR: DSCలో 967 పోస్టుల భర్తీ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 967 మందికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 1131 పోస్టులు ఉండగా 164 పోస్టులు పెండింగులో ఉన్నాయి. వీటిల్లో NGKL జిల్లాలో 59, మహబూబ్ నగర్ జిల్లాలో 29, గద్వాలలో 23, వనపర్తిలో 26, నారాయణపేటలో 27 పోస్టులను రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కోర్టు కేసులు, తదితర కారణాలతో భర్తీ చేయలేదు.

News October 11, 2024

వనపర్తి: అత్యాచారం.. ఆపై హత్య

image

గోపాల్‌పేట మం. ధర్మాతండాకు చెందిన <<14319594>>శాంతమ్మ<<>> మృతి కేసును పోలీసుల ఛేదించారు. పోలీసుల వివరాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. వనపర్తిలో ఉంటున్న NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన ప్రభాకర్.. స్థానిక గాంధీ చౌక్‌లో కూరగాయలు కొంటున్న శాంతమ్మను మాటల్లో పెట్టాడు. మద్యం తాగించి తీసుకెళ్లి చిమనగుంటపల్లి శివారులో అత్యాచారం చేశారు. అనంతరం పక్కనే ఉన్న బావిలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

News October 11, 2024

MBNR : ప్రారంభంలో పత్తి ధర అదుర్స్.. తర్వాత డమాల్ !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం. ఉమ్మడి జిల్లాల్లో 9.50 లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ధర రూ.6 వేలు నుంచి రూ.6,500 వరకు పలుకుతుంది. పత్తి ధర ప్రారంభంలో రూ.8,100 ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా పడిపోతున్న ధరలను చూసి రైతులు అమ్మకాలు జరపకుండా ఇంట్లో నిల్వ ఉంటుకుంటున్నారు. ప్రభుత్వం పత్తి ధరను పెంచాలని కోరుతున్నారు.