News April 12, 2024
ఈనెల 14న గాజువాకలో చంద్రబాబు సభ

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 14న జిల్లాకు రానున్నారు. ఆరోజు సాయంత్రం గాజువాక లంకా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి అనకాపల్లి వెళ్లి బస చేయనున్నారు. 15న అనకాపల్లి జిల్లాలో జరిగే ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సమాచారం వచ్చిందని, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు.
Similar News
News October 6, 2025
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతుంది

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతోందని జీవీఎంసీ అదనపు కమిషన్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకర్రావు తెలిపారు. దసరా సందర్భంగా ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక విరామం ఇచ్చారు. పలువురు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకున్నప్పటకీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగిచేందుకు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
News October 6, 2025
విశాఖ: ఏ జోన్లో ఎంతమంది వర్తకులున్నారంటే?

ఇటీవల యూసీడీ (UCD) విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీలోని వీధి వర్తకుల సర్వే పూర్తయింది. ఎనిమిది జోన్ల పరిధిలో 18,041 మంది వ్యాపారులను గుర్తించారు. జోన్-1 పరిధిలో 217 మంది, జోన్-2లో 2,965, జోన్-3లో 3,615, జోన్-4లో 2,879, జోన్-5లో 3,510, జోన్-6లో 2,152, జోన్-7లో 154, జోన్-8లో 2,549 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. <<17922542>>వెండింగ్ జోన్ల<<>>ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
News October 6, 2025
5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.