News September 10, 2025

ఈనెల 15 నుంచి MNCLలో ఆగనున్న వందే భారత్

image

నాగపూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఈనెల 15 నుంచి నిలపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ హాల్టింగ్‌కు కేంద్ర రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. ప్రారంభ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. వందే భారత్ హాల్టింగ్‌పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 10, 2025

62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి తల్లి

image

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆమె తల్లి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన లాగే నేను కూడా టీచర్‌గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.

News September 10, 2025

TU: కొనసాగుతున్న M.Ed, L.L.B పరీక్షలు

image

టీయూ పరిధిలోని M.Ed, LLB పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో జరిగిన M.Ed 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్ పరీక్షలకు 37 మందికి 36 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారన్నారు. యూనివర్సిటీలో జరిగిన LLB 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 28 మంది హాజరయ్యారని వెల్లడించారు.

News September 10, 2025

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం..!

image

హుకుంపేట మండలం కొంతిలి గ్రామ జాతీయ రహదారి వద్ద బుధవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండాగా మరో ఇద్దరిని ఆటోలో హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. పాడేరు నుంచి బైక్ పై వస్తున్న ఫ్యామిలీని మద్యం మత్తులో బైక్ పై ఎదురుగా వస్తున్న వ్యక్తి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.