News January 12, 2026
ఈనెల 16న నిర్మల్కు సీఎం

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు తెలిపారు. మామడ మండలం పొన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజీను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News February 6, 2026
పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. CI శ్రీను వివరాల ప్రకారం.. గద్వాల్ (D) ధరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను రాఘవేంద్ర అనే యువకుడు నమ్మించి 6 నెలల కిందట బెంగళూరుకు తీసుకెళ్లాడు. పలుమార్లు అత్యాచారం చేసి గర్భం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News February 6, 2026
కల్తీ నెయ్యి కేసు.. చిన్నప్పన్నకు బెయిల్

AP: కల్తీ నెయ్యి కేసు నిందితుడు చిన్నప్పన్నకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ కూడా దాఖలైనందున పిటిషనర్ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. రెండు వారాల్లో తనకు ఉన్న స్థిర, చరాస్తుల వివరాలతో ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలంది.
News February 6, 2026
మందస: వాసుదేవుని బ్రహ్మోత్సవాలు.. కార్యక్రమాలు ఇవే

మందస శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయంలో శనివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 7న ఆంజనేయస్వామి అభిషేకం, 8న వాసుదేవుని అభిషేకం, 9న శేషవహనసేవ, 10న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం, 11న స్వామివారి కళ్యాణం, 12న తెప్పోత్సవం, అస్వవాహనసేవ, 13న చక్రస్నానం, రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


