News October 15, 2025
ఈనెల 16న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాబ్ మేళా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 16న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఓ ప్రవేట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ పూర్తీ చేసి అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి, యువకులు తమ బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జిల్లాలోని ఎంప్లాయీమెంట్ ఆఫీస్లో సంప్రదించాలని తెలిపారు.
Similar News
News October 15, 2025
కొత్తగూడెం: కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలి

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
News October 15, 2025
కామారెడ్డి: ‘ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం’

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. AICC అబ్జర్వర్ రాజ్ పాల్ కరోలా హాజరయ్యారు. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ డీసీసీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. సీనియారిటీ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.
News October 15, 2025
కష్టపడిన వారికే పదవులు దక్కుతాయి: ఎంపీ RRR

కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కృషి చేసిన, కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పని చేసిన వారిని మర్చిపోమని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషికి గుర్తింపు ఉంటుందని చెప్పారు.