News April 17, 2025

ఈనెల 18న ADBకు మంత్రి పొంగులేటి రాక

image

భోరజ్ మండలం పూసాయిలో ఈనెల 18న ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మంత్రిచే ప్రారంభించే సదస్సుకు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 1, 2025

భీంపూర్‌లో పులి సంచారం

image

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.

News November 1, 2025

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.

News November 1, 2025

ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

image

ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌‌ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్‌ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.