News October 21, 2025

ఈనెల 22న అన్నపూర్ణేశ్వరి మాత పూజ.. స్వాములకు బిక్ష ప్రారంభం..!

image

కార్తీక పాడ్యమి సందర్భంగా ఈనెల 22న జిల్లా కేంద్రంలోని శ్రీ వీరశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం 11 గంటలకు అన్నపూర్ణేశ్వరి మాత పూజ నిర్వహించి, స్వాములకు (అన్న ప్రసాదం) బిక్షను ప్రారంభించనున్నట్లు అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ, అన్న ప్రసాద సేవా సమితి పేర్కొన్నాయి. పూజ అనంతరం మంటపంలో మాలాధారులకు అన్నప్రసాద వితరణ చేస్తామని, గురుస్వాములు, అన్న ప్రసాదదాతలు, శాశ్వత సభ్యులు, స్వాములు పాల్గొన్నాలని కోరారు.

Similar News

News October 21, 2025

NLG: జాడ లేని టి ఫైబర్ పథకం

image

జిల్లాలోని పంచాయతీలకు డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టి-ఫైబర్ పథకం జాడ లేకుండా పోయింది. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఇంటింటికీ అంతర్జాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం టి-ఫైబర్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసేలా పనులు ఆదిలోనే అటకెక్కాయి. అనేకచోట్ల పంచాయతీల్లో సౌర పలకలు అలంకారప్రాయంగా మారాయి.

News October 21, 2025

HYD: బీసీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలి: ఆర్.కృష్ణయ్య

image

శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీసీ బంద్ విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. అయితే బీసీ బంద్‌లో చిన్నాచితక గొడవలు జరిగాయని, వాటిని పోలీసులు కోరంతను కొండంత చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై బనాయించిన 30 కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.

News October 21, 2025

HYD: బీసీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలి: ఆర్.కృష్ణయ్య

image

శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీసీ బంద్ విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. అయితే బీసీ బంద్‌లో చిన్నాచితక గొడవలు జరిగాయని, వాటిని పోలీసులు కోరంతను కొండంత చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై బనాయించిన 30 కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.