News September 20, 2025
ఈనెల 22న మేడారానికి సీఎం రేవంత్

ఈనెల 22న మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. సీఎంవో నుంచి సమాచారం అందుకున్న ములుగు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ దివాకర అధికారులతో అత్యవసర సమావేశానికి ఆదేశించారు. 2026లో జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రూ.150కోట్లను మంజూరు చేశారు.
Similar News
News September 20, 2025
HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.
News September 20, 2025
రక్షణే లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు: కమిషనర్

ఆపరేషన్ లంగ్స్-2.0తో పాదచారుల భద్రత, వాహనదారుల రక్షణ లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు చేపడుతోందని కమీషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ఫుట్పాత్లు, రోడ్లు, జంక్షన్లపై అనధికార వ్యాపారాలు, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోబడతాయన్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసినవారికి వెండింగ్ జోన్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆక్రమణల రహిత పరిశుభ్రమైన నగరం కోసమే ఈ కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
News September 20, 2025
HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.