News March 17, 2025

ఈనెల 23న కరీంనగర్‌‌కు కేటీఆర్..!

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని BRS పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News September 12, 2025

కరీంనగర్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా రమేశ్

image

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్‌కి బదిలీ కాగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.

News September 11, 2025

కరీంనగర్: నిరుపయోగంగా నూతన అంబేడ్కర్ భవనం

image

కరీంనగర్ పరిధి చింతకుంటలో నిర్మించిన నూతన అంబేడ్కర్ భవనం ప్రారంభమై, సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఉపయోగంలోకి రాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News September 11, 2025

KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్‌లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.