News August 19, 2025

‘ఈనెల 24న చొప్పదండికి మీనాక్షి మేడమ్’

image

ఈనెల 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్యనేతలు యాత్రలో పాల్గొననున్నారని చెప్పాయి. 25వ తేదీ ఉదయం 7 గంటల వరకు శ్రమదానం, పార్టీ నేతల సమావేశం ఉంటుందన్నాయి.

Similar News

News August 19, 2025

మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ భవనంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లను ఆవిష్కరించారు. జేడ్పీ సీఈఓ నాసర రెడ్డి, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

News August 19, 2025

సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

image

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.

News August 19, 2025

సిద్దిపేట: ఇంటిని జాకిలతో పైకి ఎత్తేశారు !

image

టెక్నాలజీ ఉపయోగించుకుంటే అన్ని సాధ్యమే అన్నట్టుంది. సిద్దిపేటలో టైర్లు మార్చుకునేందుకు ఉపయోగించే జాకీలతో ఇంటిని పైకెత్తారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేటకు చెందిన ఆరుట్ల యాదవరెడ్డి 15ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించగా ఇప్పుడు అది రోడ్డుకు సమాంతరంగా ఉంది. దీంతో ఇంటిని 3 నుంచి 5 ఫీట్లు ఎత్తు పెంచేందుకు ఓ కన్సెక్షన్‌ను సంప్రదించగా 15 మంది కూలీల సాయంతో 100 జాకీలతో పని మొదలు పెట్టి ఇంటిని పైకి లేపారు.