News November 23, 2025

ఈనెల 24న జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పర్యటన

image

ఈనెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పీ.విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఈ నెల 24న హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఏఐసీసీ సెక్రటరీ పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News November 23, 2025

డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ

image

IND, SA మధ్య ఈనెల 30 నుంచి 3 మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. చివరి వన్డేను విశాఖలోని ACA-VDCA స్టేడియంలో ఆడనున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం AP క్రికెట్ ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ మ్యాచు టికెట్లు NOV 28 నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య ఉంటుంది.

News November 23, 2025

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా?

image

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ‘సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు స్త్రీల ఉదర భాగం నేలకు తాకుతుంది. ఆ ప్రదేశంలో గర్భకోశం ఉంటుంది. కాబట్టి గర్భకోశానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే స్త్రీలు అలా చేయకూడదు. బదులుగా మోకాళ్లపై కూర్చొని, తలను వంచి సాదర నమస్కారం చేయవచ్చు. అలాగే నడుము వంచి కూడా ప్రార్థించవచ్చు. సాష్టాంగ నమస్కారం పురుషులకు మాత్రమే’ అని చెబుతున్నారు.

News November 23, 2025

అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్–ఓవర్‌లోడ్‌ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.