News March 21, 2025
ఈనెల 27న జిల్లా, మండల పరిషత్ సభ్యుల ఎన్నికలు

కర్నూలు జిల్లా, మండల పరిషత్లలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, MPP పదవుల భర్తీకి ఈనెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్ గతేడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈఏడాది జనవరి 1న మృతిచెందారు. వెల్దుర్తి, తుగ్గలి MPPలు శారద, ఆదెమ్మ రాజీనామా చేశారు. ఈ 4 పోస్టులకు ఈనెల 23న నోటిఫికేషన్ ఇచ్చి, 27న మధ్యాహ్నం సభ్యులను ఎన్నుకుంటారు.
Similar News
News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న మృతుడి బంధువులు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
విజయవాడ: అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(19) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేసి మోసం చేశాడు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.