News December 27, 2025

ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

image

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 27, 2025

ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

image

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 26, 2025

ఇరగవరం: అమరజీవి జలధారకు శంకుస్థాపన

image

శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికీ అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడులో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.

News December 26, 2025

నరసాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో భాగంగా మైక్ సెట్ కడుతూ జెట్టిపాలెం గ్రామానికి చెందిన శీలం అభిరామ్ (19) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. చెట్టుపై మైక్ అమర్చుతుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.