News December 28, 2025

ఈనెల 29న బాపట్ల కలెక్టరేట్‌లో PGRS

image

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 29న జరిగే PGRSకు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్‌తోపాటు ప్రతి రెవిన్యూ డివిజన్లోనూ, తహశీల్దార్ కార్యాలయాలలోనూ అర్జీలస్వీకరణ ఉంటుందన్నారు.

Similar News

News December 30, 2025

పాన్-ఆధార్ లింక్.. రేపే లాస్ట్ డేట్

image

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు రేపటితో(DEC 31) ముగియనుంది. లింక్ చేసేందుకు IT <>ఈ-ఫైలింగ్<<>> పోర్టల్‌కి వెళ్లి ‘లింక్ ఆధార్’ క్లిక్ చేసి వివరాలు, OTP ఎంటర్ చేయాలి. మినిమం ఫీజు పే చేశాక మళ్లీ ‘లింక్ ఆధార్’లో డీటెయిల్స్, OTP వెరిఫై చేస్తే పాన్, ఆధార్ లింక్ అవుతాయి. గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి. మళ్లీ యాక్టివేట్ చేయాలంటే రూ.1000 చెల్లించాల్సిందే.

News December 30, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్ జిల్లాలోని వాలుకా ప్రాంతంలోని ఓ దుస్తుల కర్మాగారంలో పని చేస్తున్న హిందూ కార్మికుడు బజేంద్ర బిస్వాస్ హత్యకు గురయ్యారు. సహోద్యోగి నోమన్ మియా షాట్‌గన్‌తో కాల్చగా అది బిస్వాస్ తొడకు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News December 30, 2025

NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

image

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ ‌న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT