News March 28, 2025

ఈనెల 30 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రారంభం

image

భద్రాచలంలో జరిగే శ్రీ రామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ www.bhadradritemple. telangana.gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని ఆలయం ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు పంపిస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 6, 2026

నేపాల్.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేపాల్‌లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.

News March 6, 2026

T20 ఫ్రాంచైజీని కొంటున్న ద్రవిడ్, అశ్విన్

image

యురోపియన్ T20 ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అశ్విన్ భాగం కాబోతున్నారు. గ్లాస్గో ఫ్రాంచైజీని ఇండియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపుతో కలిసి వారు కొనుగోలు చేయనున్నారని BBC Sport తెలిపింది. అందులోనే డచ్ ఫ్రాంచైజీని సౌతాఫ్రికా ఇన్వెస్టర్లు కొననున్నట్లు వెల్లడించింది. దీనిలో డుప్లెసిస్, క్లాసెన్, జాంటీ రోడ్స్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 జట్లు ఉండే ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

News March 6, 2026

హనుమకొండ: మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిన ఇంటర్ విద్యార్థి

image

హనుమకొండ జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ సెకెండియర్ పరీక్షలో ఓ విద్యార్థిని అధికారులు పట్టుకున్నారు. పరీక్ష రాస్తున్న సమయంలో మాల్‌ప్రాక్టీస్‌కు ప్రయత్నించగా ఇన్విజిలేటర్ గమనించి పట్టుకున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఏ.గోపాల్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో మాల్‌ ప్రాక్టీస్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.