News March 28, 2025

ఈనెల 30 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రారంభం

image

భద్రాచలంలో జరిగే శ్రీ రామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ www.bhadradritemple. telangana.gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని ఆలయం ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు పంపిస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

ఈ ‘1% రూల్’తో సంపదను పెంచుకోండి!

image

పర్సనల్ ఫైనాన్స్‌లో 1% రూల్ సంపదను పెంచే ఒక సింపుల్ స్ట్రాటజీ. దీని ప్రకారం నెలవారీ ఖర్చుల్లో కేవలం 1% తగ్గించుకోవాలి. లేదా మీ సేవింగ్స్‌ను 1% పెంచాలి. చిన్న ఖర్చులను అంటే అనవసర సబ్‌స్క్రిప్షన్లు లేదా అదనపు డైనింగ్ ఖర్చులను కట్ చేసి ఆ మొత్తాన్ని SIP వంటి వాటిలో ఆటోమేట్ చేయాలి. జపాన్ టెక్నిక్ కైజెన్ లాగా ఈ చిన్న మార్పులే లాంగ్ టర్మ్‌లో మీ మీద భారం పడకుండా భారీ సంపదను క్రియేట్ చేస్తాయి.

News February 28, 2026

ఆంథ్రోపిక్‌కు ట్రంప్ ‘నో యూజ్’ షాక్

image

ఆంథ్రోపిక్ AI టెక్నాలజీ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ తమ అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. Claude AI సాఫ్ట్‌వేర్‌లోని సేఫ్‌గార్డ్స్ తొలగించి యుద్ధాల్లో వాడేలా చేయాలన్న పెంటగాన్ ఒత్తిడికి ఆ సంస్థ నిరాకరించడమే దీనికి కారణం. అటానమస్ వెపన్స్ తయారీకి సహకరించలేమని కంపెనీ స్పష్టం చేసింది. దీనిపై మండిపడిన ట్రంప్.. సైన్యం ఎలా పోరాడాలో నిర్ణయించే అధికారం ఒక ప్రైవేట్ సంస్థకు లేదని పేర్కొన్నారు.

News February 28, 2026

పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే..

image

ఇంగ్లండ్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. నేడు శ్రీలంకతో జరిగే చివరి S-8 మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే లంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అప్పుడే రన్ రేట్ పరంగా కివీస్‌ను వెనక్కి నెట్టి పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది.