News July 2, 2024
ఈనెల 4న కామారెడ్డిలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719893485882-normal-WIFI.webp)
కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈనెల 4న అథ్లెటిక్స్ పోటీలకు బాల, బాలికల ఎంపిక జరుగుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. 8,10,12 సంవత్సరాల బాలబాలికలకు రన్నింగ్, లంగ్ జంప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు బర్త్ సర్టిఫికేట్, క్రీడా దుస్తులు, బూట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
Similar News
News February 8, 2025
ఆర్మూర్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739007892306_51712009-normal-WIFI.webp)
అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని శనివారం పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య(41) తన ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సీఐ వివరించారు.
News February 8, 2025
NZB: పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఉండాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739004603497_60412797-normal-WIFI.webp)
ఈ నెల 27న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో మొదటి విడత శిక్షణ తరగతులలో కలెక్టర్ అధికారులకు దిశ నిర్దేశం చేశారు.
News February 8, 2025
NZB: 10న ప్రజా సంఘాల మహాధర్నా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739002322794_50139228-normal-WIFI.webp)
కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న హైదరాబాద్లో తలపెట్టిన ప్రజా సంఘాల మహాధర్నాను జయప్రదం చేయాలని CITU నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. శనివారం వారు మాట్లాడుతూ HYDలో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిచనున్నట్లు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.