News October 28, 2025
ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత: కలెక్టర్

విజయవాడ పరధిలోని గొల్లపూడిలో ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు.
Similar News
News October 29, 2025
తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
News October 29, 2025
కాగజ్నగర్: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

స్టాక్స్, ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ప్రజలను మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని కాగజ్నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ మంగళవారం తెలిపారు. నిందితుడు స్టాక్స్, ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి 108 మందిని అందులో చేర్చి పెట్టుబడుదారులను మోసం చేసినట్లు తెలిపారు. అందులో 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్ చేశాడని పేర్కొన్నారు.
News October 29, 2025
మంచిర్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు’

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, సంబంధిత అధికారులతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీస్ విభాగం రోడ్లపై అనాధికార వాహన నిలుపుదల నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


