News June 29, 2024

ఈవీఎం, వీవీప్యాట్లకు కట్టుదిట్టమైన భద్రత: కలెక్టర్ సృజన

image

ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముకేశ్ కుమార్ మీనా, కలెక్టర్ సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు.

Similar News

News September 15, 2025

కృష్ణా జిల్లాలో ఇంటి స్థలం కోసం 19,382 దరఖాస్తులు

image

కృష్ణా జిల్లాలో గృహ సముదాయాల కోసం ఇప్పటివరకు 19,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం.. గుడివాడ డివిజన్‌లో 3,364 మంది, మచిలీపట్నం డివిజన్‌లో 6,083 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 9,935 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. అయితే, స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

News September 15, 2025

మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News September 14, 2025

కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!  
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి