News November 3, 2025

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు అనువైన ప్రదేశాలను గుర్తించండి: కలెక్టర్

image

నంద్యాల పట్టణంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. నంద్యాల పట్టణ పరిధిలో, జాతీయ రహదారుల వెంట, పబ్లిక్ ఉపయోగానికి అనువైన ప్రదేశాలలో 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగల స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు.

Similar News

News November 4, 2025

గద్వాల: భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్లు జైలు

image

అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ప్రేమలత సోమవారం తీర్పునిచ్చారు. అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన చాకలి హరికృష్ణ తన భార్య మల్లికను వేధించడంతో ఈ ఘటన జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. మల్లిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 4, 2025

‘ప్రతి కదలికలో పరమేశ్వరుడిని చూడాలి’

image

జీవితంలో ప్రతి అంశాన్ని దైవారాధనగా భావించి, ప్రతి క్షణం పరమాత్మలో లీనమై జీవించడమే మానవ జీవిత లక్ష్యమని ‘భక్తి యోగం’ పేర్కొంది. ‘ఓ దేవా! నా ఆత్మ నీవే, నా బుద్ధియే పార్వతి. నా శరీరమే నీ గృహం. నా పంచప్రాణాలు నీ పరిచారకులు. నా ప్రతి అనుభవం నీకు చేసే పూజే. నా నిద్ర కూడా యోగ సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రం’ అంటూ పరమాత్మను సేవించాలని సూచిస్తోంది.

News November 4, 2025

కాంగ్రెస్ సలహా మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా వీరయ్య

image

భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సలహా మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విధేయతతో ప్రజాసేవ పట్ల అంకిత భావంతో ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించడంతో ఈ బాధ్యతలు అప్పగించారు.