News February 1, 2026
ఈసారి ఈ ‘శారీ’

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.
Similar News
News February 2, 2026
కరోండా మొక్కలతో పంటకు రక్షణ, ఆదాయం

పంట రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇవి చిన్న పొద రూపంలో పెరుగుతాయి. వీటి కాండం, కొమ్మలు ముళ్లతో నిండి పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తాయి. ఈ మొక్కలకు ఉండే కాయలతో రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. కరోండాను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 2, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News February 2, 2026
శత్రు విజయం సాధించాలంటే ఏ దీపం?

శత్రువులపై విజయం సాధించాలన్నా, ఇతరుల నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించాలన్నా మినప పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి దుష్ట శక్తులను, నరదిష్టిని తొలగించే శక్తి ఉంది. కుజ దోషం లేదా జాతకంలో రాహు-కేతు ప్రభావం వల్ల కలిగే ఆటంకాలను ఇది నివారిస్తుంది. భయం, ఆందోళనలు ఉన్నవారు మినప పిండి దీపాన్ని వెలిగించడం వల్ల ధైర్యం పొందుతారు. ఇది రక్షణ కవచంలా పనిచేసి కార్యసిద్ధిని కలిగిస్తుంది.


