News November 26, 2025

ఈసారి ఎలక్షన్స్‌లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

image

హన్మకొండ జిల్లాలోని మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్‌లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 29, 2026

కరీంనగర్ ఎన్నికల పరిశీలకులుగా HYD అడిషనల్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, ఆడిట్ పరిశీలకులుగా పెద్దపల్లి ఆడిట్ ఆఫీసర్ ఎం.మనోహర్ నియామకమయ్యారు. ఈమేరుకు వారు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

News January 29, 2026

KNR: మున్సిపోల్స్.. కౌన్సిలర్ టికెట్ల కోసం వెంపర్లాట

image

కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News January 28, 2026

కరీంనగర్: 3 రోజులే గడువు.. బీ-ఫామ్ ఎవరికో?

image

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో బీ-ఫామ్ ఎవరికీ దక్కనుందని అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాలను ఎంపికలో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్ఠానం గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని బీ-ఫామ్ కేటాయించనున్నారు. కొందరు ఆశావహులు పార్టీలు మారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏం జరుగుతుందో చివరి క్షణం వరకు చూడాలి.