News July 8, 2025
ఈ-ఆరోగ్యం నమోదులో కామారెడ్డి జిల్లాకు అగ్రస్థానం

కామారెడ్డి జిల్లా ఈ-ఆరోగ్యం ఆన్లైన్ అప్లికేషన్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25,152 మంది చికిత్స పొందగా, 23,723 మంది డాక్టర్లను సంప్రదించారు. 5,232 మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 21,539 మంది ఔషధ సేవలు పొందారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, DMHO చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
Similar News
News July 8, 2025
HYD: యువతి కడుపులో పావలా కాయిన్!

25 ఏళ్లుగా యువతి కడుపులో ఉన్న పావలా కాయిన్ను గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి బయటకు తీశారు. సిటీకి చెందిన ఓ యువతి(28) తన మూడేళ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్ను మింగేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగానికై ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుండగా కడుపులోని కాయిన్ కారణంగా కడుపు నొప్పి కలిగింది. సదరు యువతి గాంధీలో అడ్మిట్ కాగా జనరల్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి పావలా కాయిన్ , ఓ స్టోన్ను బయటకు తీశారు.
News July 8, 2025
Historic Moment

శ్రీశైలం డ్యాం చరిత్రలో జులైలో గేట్లు తెరుస్తుండటం ఇది ఐదోసారి. సాధారణంగా ఆగస్టు, SEPలో గేట్లు ఎత్తుతుంటారు. ఈసారి జూన్లోనే ఎగువన వర్షాలు కురవడంతో డ్యాంకు వరద భారీగా చేరుతోంది. కొన్నిగంటల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
★ జులైలో గేట్లు ఎత్తిన సందర్భాలు..
2025: జులై 8, 2007: జులై 23, 2021: జులై 28, 2022: జులై 23, 2024: జులై 29
News July 8, 2025
HYD: యువతి కడుపులో పావలా కాయిన్!

25 ఏళ్లుగా యువతి కడుపులో ఉన్న పావలా కాయిన్ను గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి బయటకు తీశారు. సిటీకి చెందిన ఓ యువతి(28) తన మూడేళ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్ను మింగేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగానికై ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుండగా కడుపులోని కాయిన్ కారణంగా కడుపు నొప్పి కలిగింది. సదరు యువతి గాంధీలో అడ్మిట్ కాగా జనరల్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి పావలా కాయిన్ , ఓ స్టోన్ను బయటకు తీశారు.