News October 10, 2024
ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్

గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.
Similar News
News July 10, 2025
GNT: ‘అరటిగెల కోసే కత్తితో పొడిచి చంపారు’

స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.
News July 10, 2025
16వ తేదీ లోపు వివరణ ఇవ్వాలి: కలెక్టర్

భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఈసీ
నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎందుకు పోటీ చేయలేదనే అంశాలపై 6 రోజుల్లో లిఖిత పూర్వకంగా ప్రధాన ఎన్నికల అధికారికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశాలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News July 10, 2025
గుంటూరులో గంజాయి అమ్ముతున్న యువకుల అరెస్ట్

గుంటూరు శివ నాగరాజు కాలనీలో గంజాయి విక్రయిస్తున్న గోపి, కార్తికేయలను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ లతా తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 253 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్కు తరలించారు. ఈ ఆపరేషన్లో ఎస్ఐలు షరీఫ్, తిరుమలేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.