News February 14, 2025

ఈ నెల 20న కొండనాగులలో జాబ్ మేళా

image

బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు వచ్చే వారు 10th, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆధార్ కార్డు, పాస్ ఫొటోలు తీసుకురావాలన్నారు.

Similar News

News July 6, 2025

లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారం

image

మదనపల్లెలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమైనట్లు అదాలత్ సిబ్బంది తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించిన కక్షదారులను రాజీమార్గంలో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. క్రిమినల్ 144 కేసులు, సివిల్ 25 కేసులు మొత్తం 169 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారంగా రూ.77 లక్షలు అందజేశారు.

News July 6, 2025

HYD: తక్కువ ఖర్చుతో పార్సిల్.. సెంటర్లు ఇవే..!

image

తక్కువ ఖర్చుతో ఇతర ప్రాంతాలకు RTC కార్గో సెంటర్ల ద్వారా పార్సిల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD రీజియన్ పరిధి నాగోల్ క్రాస్ రోడ్డు, ఓయూ క్యాంపస్, పనామా గోడౌన్, సంతోష్ నగర్, ఆరాంఘర్, గుడిమల్కాపూర్, బోలకపూర్, నాంపల్లి, టెలిఫోన్ భవన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్, నారాయణగూడ, సంతోష్ నగర్, చింతలకుంట, పెద్దఅంబర్పేట, మునగనూరు క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. బరువు ప్రకారం ఛార్జీ ఉంటుంది.

News July 6, 2025

పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

image

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PS‌లో ఫిర్యాదు చేసింది.