News December 18, 2025
ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్: ASF SP

ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న క్రిమినల్, సివిల్, ఎక్సెజ్, మోటారు వాహనాల కేసులను అధిక సంఖ్యలో రాజీ కుదుర్చుకొని క్లోజ్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News December 19, 2025
విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.
News December 19, 2025
KNR: వరుసగా చెక్ డ్యాంల ధ్వంసం.. చర్యలేవీ..?

చెక్ డ్యాంలను ఇసుక మాఫియా ధ్వంసం చేస్తుందా లేక నీటి ప్రవాహానికి కూలుతున్నాయా అనే విషయాన్ని అధికారులు తేల్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియా బ్లాస్ట్ చేశాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా ప్రభుత్వం విచారణ పేరుతో జాప్యం చేస్తుందన్న విమర్శలొస్తున్నాయి. నిన్న అడవిసోమన్పల్లి, ఇటీవల గుంపుల చెక్ డ్యాం కూలిన ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నా ఇసుక అక్రమ రవాణా కట్టడిపై చర్యలు లేకపోవడం గమనార్హం.
News December 19, 2025
వరంగల్ జిల్లాలో సాగు వివరాలు..!

జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభమైంది. 2025-26 యాసంగి పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై కలెక్టర్
సత్య శారద సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న 26,510 ఎకరాలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనాతో 23,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల అంచనాకు 8,680 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.


