News December 20, 2025
ఈ నెల 28 నుంచి అసెంబ్లీ?

TG: ఈ నెల 28 నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ట్ పాలసీ, ఇరిగేషన్, GHMC విలీన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్పై ఏసీబీ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సర్కారు పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో BCలకు పార్టీపరంగా 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News December 22, 2025
పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి: పవన్

AP: అమరజీవి పొట్టి శ్రీరాములుకు గౌరవం ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని Dy.CM పవన్ అభిప్రాయపడ్డారు. తన ఆలోచనపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. మహనీయుడు అంబేడ్కర్కు కూడా కులం ఆపాదించడం సరికాదన్నారు. ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన మాట్లాడారు.
News December 22, 2025
ఐడియాలజీ సరైంది కాకుంటే ఇబ్బందులు: పవన్

AP: జనసేన కోసం పనిచేసిన వారందరినీ గుర్తించామని పార్టీ చీఫ్, Dy.CM పవన్ చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందినవారితో మంగళగిరిలో మాట్లాడారు. ‘ఓడిపోయినా నిలబడినందుకే మీకు పదవులు వచ్చాయి. మీరంతా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. యువతకు సరైన వేదికగా నేను పార్టీ పెట్టా. అప్పట్లో కొత్త పంథాను నమ్ముకుని మావోలుగా మారి వేలాదిమంది చనిపోయారు. ఐడియాలజీ సరైంది కాకుంటే ఇలాంటి ఇబ్బందులొస్తాయి’ అని తెలిపారు.
News December 22, 2025
బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ఎంతంటే?

బంగ్లాదేశ్లో హిందువులపై ఈ మధ్య దాడులు పెరిగాయి. ఇటీవల దీపూ చంద్రదాస్ హత్యతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత ప్రభుత్వం సైతం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ హిందువుల జనాభా ఎంతనే చర్చ జరుగుతోంది. బంగ్లా 2022 సెన్సస్ ప్రకారం ఆ దేశంలో దాదాపు 1.3 కోట్ల మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 8%. భారత్, నేపాల్ తర్వాత అత్యధిక మంది హిందువులున్నది బంగ్లాలోనే.


