News February 25, 2025

ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత: ASF కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆర్థిక అవగాహన కలిగి ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం ఎస్బీఐ నిర్వహించిన మహిళా ఉద్యోగుల ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. RBI 2016 నుంచి ప్రతి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు ఉన్నారు.

Similar News

News February 23, 2026

నాగర్‌కర్నూల్: 3 రోజులు కొట్టుమిట్టాడిన పసి ప్రాణం..!

image

FEB 18- కుమ్మెర జాతరలో దాడి, PSలో బాధితుల ఫిర్యాదు
FEB 21- 3రోజుల తర్వాత చికిత్స పొందుతూ చిన్నారి మృతి, మళ్లీ PSకు వచ్చిన బాధితులు
FEB 21- పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆరోపణ
FEB 21- వార్త తెలిసి ఆగ్రహించిన ధర్మ సమాజ్ నేతలు NGKLఆస్పత్రి ఎదుట ధర్నా
FEB 21- నిందితులపై కేసు నమోదు చేస్తామని DSP హామీ
FEB 22- బాధితులకు మద్దతిస్తూ BRS, TRP, బీసీ సంఘాల నేతల ధర్నా
FEB 22- ముగ్గురు నిందితుల అరెస్ట్

News February 23, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

News February 23, 2026

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>నైవేలి<<>> లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా/డిగ్రీ( మైనింగ్) అర్హతగల వారు మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. Jr.ఓవర్‌మెన్‌కు నెలకు రూ.31k-రూ.1L, మైనింగ్ సిర్ధార్‌కు రూ.26K-రూ.1.10L చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.nlcindia.in