News June 7, 2024

ఈ నెల 8, 9 తేదీల్లో నాంప‌ల్లికి ప్ర‌త్యేక బ‌స్సులు

image

నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో చేప ప్ర‌సాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్ర‌సాదం పంపిణీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి నాంప‌ల్లికి ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని టీజీఎస్‌‌ఆర్టీసీ నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టు నుంచి బ‌స్సులు అధిక సంఖ్య‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. SHARE IT

Similar News

News September 15, 2025

HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్‌లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 15, 2025

‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

image

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.

News September 15, 2025

HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

image

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్‌లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.