News February 25, 2026
ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 1, 2026
ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్కు IRGC వార్నింగ్

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. తమ నాయకుడి మరణానికి బాధ్యులైన ఆ దేశాలకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. కాగా IRGC ఇరాన్ శక్తిమంతమైన దళాలలో ఒకటి. ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఖొమైనీ స్థాపించిన ఈ IRGCని ఖమేనీ తిరుగులేని శక్తిగా మలిచారు. దీని సాయంతోనే ఇరాన్ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
News March 1, 2026
44 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ద్వారా 44 పోస్టుల భర్తీకి UPSC దరఖాస్తులు కోరుతోంది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in
News March 1, 2026
ఏటి సూతకంలో నిత్యపూజ చేయవచ్చా?

ఏటి సూతకంలో ఉంటే ఇంట్లో పూజ చేయకూడదని చాలామంది పొరపడుతుంటారు. కానీ నిత్యపూజ తప్పనిసరిగా చేయాలంటున్నారు పండితులు. ‘దీపం పెట్టని ఇల్లు స్మశానంతో సమానం. కాబట్టి, దేవుడి పటాలకు గంధం, పుష్పం, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. దంపతులు కలిసి నిత్యపూజలో కూర్చున్నా ఎలాంటి దోషం ఉండదు. నిత్యం భగవంతుని స్మరిస్తే మంచి జరుగుతుంది. ఆ పుణ్య ఫలాన్ని పితృదేవతలకు ధారపోస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది’ అంటున్నారు.


