News February 22, 2025
ఉంగుటూరులో 1.13 లక్షల కోళ్లు ఖననం

ఉంగుటూరు మండలంపై బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే బాదంపూడి గ్రామంలోని వెంకట మణికంఠ పౌల్ట్రీస్ లో ఈనెల 13 నుంచి 20 బృందాలు పనిచేస్తున్నాయని ఇన్ ఛార్జ్ జేడీ టి. గోవిందరాజు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు 1.13 లక్షలకు పైగా కోళ్లు, 1.63 లక్షలకు పైగా గుడ్లను ఖననం చేశామన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: పడిపోయిన BJP ఓట్ల శాతం!

గత ఎన్నికతో పోల్చితే BJP ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికలో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 14.11 శాతం అంటే 25,866 ఓట్లు వచ్చాయి. ఈ ఉపఎన్నికలోనూ BJP తరఫున లంకల దీపక్ రెడ్డే పోటీ చేయగా కేవలం 8.76 శాతం అంటే 17,061 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ గల్లంతైంది. అంటే గత ఎన్నికతో పోల్చితే 8,805 ఓట్లు తగ్గాయి. కాగా రెండు సార్లు BJP మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం.
News November 14, 2025
జూబ్లీహిల్స్ ‘బస్తీ’వాసి హస్తం

జూబ్లీహిల్స్ గెలుపులో కీలకమైన బస్తీలను తనవైపు తిప్పుకోవడంలో నవీన్ యాదవ్ సక్సెస్ అయ్యారు. ప్రతి ప్రచారంలో ‘మీ బస్తీ నుంచి వచ్చాను. మీలో ఒకడిని. మీ ముందే పెరిగాను. మన బస్తీ రూపురేఖలు మార్చుతాను. మీ తమ్ముడిని గెలిపించుకోండి’ అంటూ ఆయన అభ్యర్థించారు. తనను గెలిపించమని చెప్పకుండా.. బస్తీని గెలిపించుకోండి అంటూ ఓటరు నాడీకి పరీక్ష పెట్టారు. ఫలితంగా ‘యూసుఫ్గూడ బస్తీవాసి’ చరిష్మా ఘన విజయాన్ని అందించింది.
News November 14, 2025
నిర్మల్: ఐరన్ మ్యాన్ అవార్డు గ్రహీతకు సన్మానం

నిర్మల్లోని మారుతి ఇన్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పలువురిని సన్మానించారు. ‘ఐరన్ మ్యాన్ అవార్డు’ సాధించిన డాక్టర్ బి.ఎల్. నరసింహారెడ్డిని, అలాగే రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఇద్దరినీ సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ల సేవలను ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, అభిమానులు పాల్గొని అభినందనలు తెలిపారు.


