News June 25, 2024
ఉంగుటూరు: తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

ఉంగుటూరు- ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమాటా లోడుతో వెళుతున్న లారీకి పంక్చర్ పడగా, టైరు మార్చేందుకు అటుగా వెళ్తున్న టాటా మ్యాజిక్ డైవర్ సాయం వచ్చాడు. ఈ క్రమంలో సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News September 14, 2025
కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి
News September 14, 2025
మచీలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి మూడవ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 72 ప్రశ్నలు అడగటంతో పాటు 18 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 79.41%గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.