News November 13, 2025
ఉంగుటూరు: ‘రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతివ్వాలి’

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం కలెక్టర్ కె.వెట్రి సెల్విని, అటవీ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశబ్దాలుగా కొల్లేరులో వ్యవసాయం చేసుకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులను కొల్లేరులో వ్యవసాయం చెయ్యటానికి వీలు లేదన్నారు. గత కొన్ని రోజులుగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
Similar News
News November 13, 2025
ఈరోజు తీవ్ర చలి.. జాగ్రత్త!

TG: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందని అంచనా వేశారు. రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10-11°Cకి, నార్త్, వెస్ట్ తెలంగాణలో 7-10°Cకి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 13, 2025
MBNR: ఎస్సీ విద్యార్థులకు అకౌంట్లోనే డబ్బులు జమ

ఎస్సీ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి స్కాలర్షిప్లు డబ్బులు తమ అకౌంట్లోనే జమ అవుతాయని డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో యూనివర్సిటీ విద్యార్థులకు సమావేశం నిర్వహించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగం కుమారస్వామి పాల్గొన్నారు.
News November 13, 2025
పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

మహబూబ్ నగర్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.


