News March 21, 2024
ఉండిలో 9 మంది వాలంటీర్ల తొలగింపు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710943186827-normal-WIFI.webp)
ఉండి మండలం ఉణుదుర్రు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న వాలంటీర్స్ పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 9 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. వాలంటీర్లు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News July 8, 2024
ప.గో జిల్లాలో జోరుగా వ్యవసాయ పనులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720397675432-normal-WIFI.webp)
ప.గో జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం మండలాల్లో 21,983 ఎకరాల్లో ఇప్పటికే నాట్లు పడ్డాయన్నారు. ఈ నెలాఖరుకు అత్యధిక విస్తీర్ణంలో నాట్లు పూర్తవుతాయని, పల్లపు ప్రాంతాల్లో నారు సంరక్షణకు రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
News July 8, 2024
ఏలూరు: UPDATE.. మృతులు HYDవాసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720405803595-normal-WIFI.webp)
ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి పరిధిలోని రాజవోలు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. కారు డ్రైవర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన దుర్గా వంశీగా గుర్తించారు.
News July 8, 2024
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720401533438-normal-WIFI.webp)
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, బాలుడికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా లక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.