News October 2, 2025
ఉండి: జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీ

ఉండి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 అవగాహన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ సమీకృత వ్యవసాయ పరీక్షా కేంద్రం (ల్యాబ్)ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Similar News
News October 3, 2025
అత్యంత కిరాతకంగా చంపి… గోనె సంచిలో కుక్కి..!

తణుకులో అదృశ్యమై తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శవమై తేలిన మడుగుల సురేశ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు సురేశ్ను హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి గోనె సంచిలో కుక్కి గోదావరిలో పడవేసినట్లు తెలుస్తోంది. న్యాయవాది సోదరుడి కారులో మృతదేహాన్ని తరలించారనే అనుమానంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News October 3, 2025
జిల్లాలో నేటి నుంచి 3వ పేజ్ రీ సర్వే: కలెక్టర్

జిల్లాలో నేటి నుంచి 3వ దశ రీ-సర్వే జిల్లాలో మొదలవుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 221 గ్రామాలలో రీ-సర్వే పూర్తి చేశామని, మరో 22 గ్రామాలలో జరుగుతోందని అన్నారు. రైతులందరూ రీ-సర్వేకు సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీస్ ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News October 2, 2025
రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర అవార్డులు: కలెక్టర్ హర్షం

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో 1 రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. దేశంలోనే ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ వివరాలను సాసా (SASA) పోర్టల్ https://sasa.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.